Actress Sreenija: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీనిజ అందరికీ తెలిసిందే. గతంలో ఈమె మోహన్ బాబు గారి కుటుంబం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు కుటుంబం గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక వివాదంలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను 5 లక్షల విలువ చేసే సామాగ్రి దొంగతనం చేశారని అతని పై పోలీస్ కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై నాగ శ్రీను స్పందిస్తూ తనకు వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ ఇంటి నుంచి వచ్చానని అయితే మంచు కుటుంబం తనను కులం పేరుతో దూషిస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా అవమానించారని ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
ఇక ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో అంటూ నటి శ్రీనిజను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగ శ్రీనుకి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరో ఓ మహిళ నాగ శ్రీను తనకు అన్యాయం చేశారంటూ ఉన్న వీడియో వైరల్ అవుతోంది.నాగ శ్రీను గత పది సంవత్సరాల నుంచి మోహన్ బాబు గారి దగ్గర పనిచేస్తూ అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ విషయం గురించి మోహన్ బాబు గారు తనని తిట్టి ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
మోహన్ బాబు అలా వ్యవహరించే వారే అయితే గత పది సంవత్సరాల నుంచి నాగ శ్రీను అక్కడ ఎలా ఉద్యోగం చేస్తున్నారు.తనకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వారి దగ్గరికి వెళ్లి ఇది నా పరిస్థితి అంటే వారి దానికి హెల్ప్ చేస్తారు. కానీ ఇలా లేనిపోని కారణాలు వెతికి అలాంటి కుటుంబాన్ని కించపరచడం భావ్యం కాదనీ శ్రీనిజ తెలియజేశారు. ఈ విషయంలో తాను మోహన్ బాబు గారికి సపోర్ట్ చేస్తానని తను మాట కాస్త కటువుగా ఉన్నా తన మనసు మంచిది అంటూ శ్రీనిజ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…