Movie News

Shayamala Devi: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఇందులో నిజమెంత?

Shayamala Devi: సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తాజాగా కృష్ణం రాజు జయంతి సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్యామలా దేవి తన భర్త గురించి, హీరో ప్రభాస్ గురించి తన ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారింది. అయితే శ్యామలా దేవి భర్త దివంగత నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు రాజకీయాల్లో రాణించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రి వర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో చాలా కాలం కొనసాగారు కృష్ణంరాజు.

మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. మళ్లీ బీజేపీ బాట పట్టారు. ఇక కృష్ణం రాజు మరణించిన ఇంత కాలానికి ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. తాజాగా కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలా దేవి. అంతే కాకుండా చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయరంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు.

కృష్ణంరాజు మార్గంలోనే నడుస్తాను..

కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. ఈ రకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి వస్తారు కాబట్టే.. తరువాత విషయం ప్రకటిస్తాను అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇక శ్యామలా దేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు లాంచనంగా వైసీపీలోకి వెళ్లడమే మిగిలినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

16 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago