బాహుబలి’ సినిమా తరువాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు హీరో ప్రభాస్. సాహో తరువాత నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. కేజిఎఫ్ తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో “సలార్” సినిమా, ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్తో “ఆదిపురుష్” చిత్రం షూటింగ్ షూటింగ్ జరుగుతున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ నాగ అశ్విన్తో ఓ సినిమా ప్లాన్ చేసాడు ప్రభాస్.
అయితే తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ ‘ఆదిపురుష్’ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం టీ-సిరీస్ ఫిల్మ్స్ ప్రభాస్కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలిసింది. ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ నటిస్తున్న ఈ చిత్రం పౌరాణికం నేపధ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జేట్తో రూపొందుతున్న ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…