బాహుబలి’ సినిమా తరువాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు హీరో ప్రభాస్. సాహో తరువాత నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. కేజిఎఫ్ తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో “సలార్” సినిమా, ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్తో “ఆదిపురుష్” చిత్రం షూటింగ్ షూటింగ్ జరుగుతున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ నాగ అశ్విన్తో ఓ సినిమా ప్లాన్ చేసాడు ప్రభాస్.

అయితే తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ ‘ఆదిపురుష్’ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం టీ-సిరీస్ ఫిల్మ్స్ ప్రభాస్కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలిసింది. ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ నటిస్తున్న ఈ చిత్రం పౌరాణికం నేపధ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జేట్తో రూపొందుతున్న ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది.






























