Categories: FeaturedGeneral News

బస్సుకు నిప్పుపెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా?

కొందరు ఆవేశంతో చేస్తారో లేదా.. ఆలోచనతో చేస్తారో తెలియదు కానీ.. బారీ నష్టం జరిగి తర్వాత పశ్చాతాపపడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు.. పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఓ బస్సుకు నిప్పు అంటించాడు. ఆ బస్సు కనిగిరి నుంచి పామూరు వెళ్తుంది. అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకొక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు విచారించారు. ఎందుకు ఇలాంటి పని చేశావ్ అంటూ అని అడగ్గా.. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి.. త్వరలో జనసేన అధికారంలోకి వస్తుంది.. వాటి ధరలు తగ్గిస్తుందని అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

అంతేకాకుండా అతడు సీఎం జగన్ ను కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అనుమానించి.. కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ పేర్కొన్నాడు. అక్కడ మంటల్లో చిక్కుకున్న వాళ్లకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

17 minutes ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

28 minutes ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

43 minutes ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

56 minutes ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

1 hour ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

1 hour ago