Prakash Raj supports Sai Pallavi : నక్సలిజం బ్యాక్డ్రాప్లో సాయి పల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదల ముందు సాయి పల్లవి ప్రమోషన్ కార్యక్రమాలలో బాగా పాల్గొన్నారు.
అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్ సినిమాలోని లోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం’ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం కూడా వ్యక్తపరచారు. అయితే వీటిపై వివరన ఇస్తూ సాయి పల్లవి ఒక వీడియోని విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సాయి పల్లవి ఇచ్చిన వివరణ పై ప్రకాష్ రాజ్ స్పందించారు.
మానవత్వమే అన్నిటికన్నా ముందు…..
సాయి పల్లవి వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి ముమ్మాటికీ లేదని తన మాటలకు వివరణ ఇచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన ఈ వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
స్పందించడమే కాదు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్లో ‘మానవత్వమే అన్నింటికంటే ముందు…. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.’ అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు ప్రకాశ్ రాజ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…