Featured

Prathyusha : ప్రత్యూషని రేప్ చేసి చంపేస్తే జడ్జి 40,000 ఇవ్వమని చెప్పాడు… ఆయనకు దండం పెట్టి వచ్చేసా : సరోజినీ దేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోను హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయినా న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా తనకు లేదని సరోజినీ దేవి కోర్ట్ జడ్జిమెంట్, సాక్ష్యాలను ఎలా మార్చారో ఇంటర్వ్యూలో వివరించారు.

రేప్ చేసి చంపేస్తే జడ్జి 40,000 ఇవ్వమన్నాడు…

ప్రత్యూష ఆత్మహత్య కాదు హత్య అంటూ మొదటి నుండి చెబుతున్న ప్రత్యుష తల్లి సరోజినీ దేవి గారు ప్రత్యూష మరణించిన వెంటనే నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్ లో మునిస్వామి అనే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ను అధికార దూర్వినియోగం చేసి ఎలా తారుమారు చేసారో చెప్పారు. మొదట విచారణ జరిపాక సిబిఐ కోర్ట్ సిద్ధార్థ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సిపిఐ నాయకులు బీవీ రాఘవులు గారి భార్య పుణ్యవతి గారు ప్రజాప్రయోజన వాజ్యం వేయడం తో నాంపల్లి సెషన్ కోర్ట్ కు కేసు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అక్కడ మునిస్వామి గారి పోస్టుమార్టం రిపోర్ట్ ను పక్కన పెట్టి మళ్ళీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ అంటూ డాక్టర్లతో వేయించి ప్రత్యూష ఆత్మహత్య ద్వారా చనిపోయింది అసలు తన పై అత్యాచారం జరగలేదు అంటూ నివేదిక ఇచ్చారు. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడు కాబట్టి సిద్ధార్థ రెడ్డికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష వేశారు. దీంతో సరోజినీ దేవి గారు హై కోర్ట్ ను ఆశ్రయించారు.

ఇక హై కోర్ట్ లో మొత్తం సాక్ష్యాలను హై కోర్ట్ లో భద్రపరుస్తున్నట్లు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకూడదని రూల్ పాస్ చేసి సిధార్థ రెడ్డి జైలు శిక్షను రెండున్నరేళ్లకు తగ్గించి ఆత్మహత్య గా మార్చారు. ప్రత్యూష చనిపోయింది కాబట్టి 40,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆ జడ్జి తీర్పు ఇవ్వడం తో సరోజినీ దేవి ఆ నలభైవేలు తీసుకోడానికి నిరాకరించి అత్యాచారం జరిగి బ్రతికేవున్న బాధితులకు ఇవ్వండని చెప్పి వచ్చేసారట. ఇక సుప్రీం కోర్ట్ లో ప్రస్తుతం కేసు వేశారు సరోజినీ దేవి గారు కానీ బెంచ్ కి రానివ్వకుండా చెస్తున్నారని, న్యాయమూర్థిని పెట్టుకుంటాం అంటూ సిద్ధార్థ తరుపున వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు అంటూ సరోజినీ దేవి గారు అభిప్రాయపడ్డారు. కానీ ఏం చేయకుండా ఉండకూడదు పోరాడాను అన్న తృప్తి అయినా నాకు మిగులుతుందని పోరాడుతున్నాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago