Featured

Prathyusha : ప్రత్యూష చనిపోతే మోహనబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నా మొహం చూడను అని తిట్టారు : ప్రత్యూష మదర్ సరోజినీదేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు, ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు కానీ ఎవరూ సహాయం చేయలేదని  చెప్పారు.

మోహన్ బాబు నన్ను తిట్టారు… మాణిక్యాన్ని పోగొట్టుకున్నావు అన్నారు…

ప్రత్యూష మరణం తరువాత ఇండస్ట్రీ నుండి రోజా, ఉదయ్ కిరణ్, ప్రభు, వెంకట్, సత్యరాజ్ వంటి వారు ఫోనే చేసి పరామర్శించారు. అయితే నేను పోరాడుతుంటే ఎవరూ మద్దతు ఇవ్వలేదంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చెప్పారు. ఇక మోహన్ బాబు గారు ప్రత్యూష మరణించాక ప్రెస్ మీట్ లో నన్ను తిట్టారంటూ చెప్పి ఆ హక్కు ఆయనకు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.

ఒక మంచి పాత్రతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అమ్మ చేతిలో పెట్టి చూసుకోమంటే పోగొట్టుకుంది, ఒక మాణిక్యాన్ని కోల్పోయింది, జీవితంలో మళ్ళీ ఆ తల్లి మొహం నేను చూడను అంటూ చెప్పాడట. ఈ విషయాలను సరోజినీ గారు చెబుతూ ఆయనకు ఆ హక్కు ఉంది నన్ను అనడానికి అంటూ చెప్పారు. ఎవరూ సహాయం చేయకపోయినా ఎన్నేళ్ళైనా పోరాడుతున్నాను చాలా మంది న్యాయం జరగదు వదిలేయండి అంటుంటారు కానీ నేను పోరాడుతూనే ఉన్నాను, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళాను అంటూ సరోజినీ చెప్పారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

6 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

6 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

6 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

6 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

6 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

6 hours ago