Featured

Prathyusha : ప్రత్యూష చనిపోతే మోహనబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నా మొహం చూడను అని తిట్టారు : ప్రత్యూష మదర్ సరోజినీదేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు, ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు కానీ ఎవరూ సహాయం చేయలేదని  చెప్పారు.

మోహన్ బాబు నన్ను తిట్టారు… మాణిక్యాన్ని పోగొట్టుకున్నావు అన్నారు…

ప్రత్యూష మరణం తరువాత ఇండస్ట్రీ నుండి రోజా, ఉదయ్ కిరణ్, ప్రభు, వెంకట్, సత్యరాజ్ వంటి వారు ఫోనే చేసి పరామర్శించారు. అయితే నేను పోరాడుతుంటే ఎవరూ మద్దతు ఇవ్వలేదంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చెప్పారు. ఇక మోహన్ బాబు గారు ప్రత్యూష మరణించాక ప్రెస్ మీట్ లో నన్ను తిట్టారంటూ చెప్పి ఆ హక్కు ఆయనకు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.

ఒక మంచి పాత్రతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అమ్మ చేతిలో పెట్టి చూసుకోమంటే పోగొట్టుకుంది, ఒక మాణిక్యాన్ని కోల్పోయింది, జీవితంలో మళ్ళీ ఆ తల్లి మొహం నేను చూడను అంటూ చెప్పాడట. ఈ విషయాలను సరోజినీ గారు చెబుతూ ఆయనకు ఆ హక్కు ఉంది నన్ను అనడానికి అంటూ చెప్పారు. ఎవరూ సహాయం చేయకపోయినా ఎన్నేళ్ళైనా పోరాడుతున్నాను చాలా మంది న్యాయం జరగదు వదిలేయండి అంటుంటారు కానీ నేను పోరాడుతూనే ఉన్నాను, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళాను అంటూ సరోజినీ చెప్పారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

14 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

15 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

15 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

15 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

17 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

18 hours ago