Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువస్తే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమాలు డిజాస్టర్ గా మిగిలి పెద్ద ఎత్తున నష్టాలను తెచ్చి పెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందినదే పూరి జగన్నాథ లైగర్ సినిమా.
ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో ఎత్తుపల్లాలని చూసిన పూరీ జగన్నాథ తన సినీ కెరియర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టారు. ఇదే అంచనాల నడుమ ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంచనాలను తలకిందులు చేసి భారీ నష్టాలను మిగులుతుంది.
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ బయ్యర్లకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా తిరిగి ఇచ్చారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా పూరి జగన్నాథ్ బయ్యర్లతో మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ లీక్ అయింది. అయితే ఇందులో బయ్యర్లు పూరి జగన్నాథ్ కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో పూరి మాట్లాడుతూ ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా నేను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఇస్తున్నాను వాళ్లు కూడా నష్టపోయారన్న ఉద్దేశంతోనే తిరిగి డబ్బులు ఇస్తున్నాను అంటూ ఈయన మాట్లాడారు.
నిజంగానే పూరికి వార్నింగ్ ఇచ్చారా..
బయ్యర్లతో కలిసి మాట్లాడడం జరిగింది మా ఇద్దరి మధ్య ఒక అమౌంట్ సెటిల్ అయ్యింది. కొద్ది రోజులు టైం కావాలని అడిగినా కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలనిపించదు అంటూ పూరి మాట్లాడారు. ఇకపోతే ధర్నాలు చేస్తామని డిమాండ్ చేస్తే ధర్నా చేసిన వారందరూ లిస్టు తాను తీసుకొని వారికి తప్ప మిగిలిన వారందరికీ డబ్బు ఇస్తానంటూ ఈయన తెలిపారు.నష్టాలు వస్తే డబ్బు ఇవ్వమని డిమాండ్ చేస్తారు లాభాలు వస్తే బయర్లు డబ్బు ఇవ్వరు కదా నాకు పోకిరి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు ఎంతో మంది బయ్యర్లు చాలా వరకు డబ్బు ఇవ్వాల్సి ఉంది అంటూ పూరి మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…