బుల్లితెరలో ఎంటర్టైన్మెంట్ షోలు, పలు అవార్డు ఫంక్షన్ లు ఇలా ఎన్నో ప్రసారం అవుతుంటాయి. ఇక అందులో ఎంత వినోదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో పాల్గొనే గెస్ట్ లు కూడా తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొడతారు. ఇదిలా ఉంటే బుల్లితెర సీరియల్స్ వాళ్లకి సంబంధించిన పలు అవార్డు ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాం జరగనుండగా దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఆ ప్రోగ్రాం కు యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమ సీరియల్స్ ముందు స్థానంలో నిలవాలన్న ఉద్దేశంతో బాగా పోరాడుతున్నారు. ఇక సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ కప్ ను అందుకోవడానికి ప్రతి ఒక్క సీరియల్స్ వాళ్ళు తెగ డాన్సులతో అదరగొడుతున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. తాజాగా వచ్చిన ప్రోమో గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో… ప్రేమ ఎంత మధురం మరియు రామ సక్కని సీత సీరియల్స్ లో నిటించిన వారికి పోటీ జరిగింది.
దీనిలో ముఖ్యంగా చెప్పాల్సినవి ఏంటంటే.. వారికి ప్రశ్నలను సందిస్తూ.. సమాధానం చెప్పి స్టీల్ గిన్నెలను తీసుకెళ్లండంటూ ప్రదీప్ చెబుతాడు. మనీని ఎవరు కనిపెట్టారంటూ అడుగుతూ.. ప్రియమనీ, మనిరత్నం అంటూ హాస్యాన్ని పంచాడు. టైమ్ మిషన్ ను ఎవరు కనిపెట్టారంటూ కూడా అడిగాడు. అందులో కూడా కామెడీ చేశాడు ప్రదీప్. ప్రేమ ఎంత మధురంలో ప్రేమ ఎంత మధురం? అంటూ ప్రశ్న అడిగాడు. కొంత, ఇంత, అంతా అంటూ ప్రదీప్ మరోసారి కామెడీగా వారిని నవ్వించే ప్రయత్నం చేశాడు.
ఇంకా ఆగస్టు 9 న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ప్రదీప్ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటోను వారికి చూపించాడు. దానిని ఫజిల్ రూపంలో వారికి ఒక గేమ్ ఇచ్చాడు. చివర్లో సీరియల్ లో నటుడు అయిన మహేశ్ ప్రదీప్ కు ఓ గిఫ్ట్ ఇస్తాడు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే.. ఆగస్టు 9 న వచ్చే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ చూడండి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…