General News

ఇక ఫోన్ పే, గూగుల్ పే అవసరం లేదు.. నేరుగా వోచర్ల ద్వారానే డబ్బులు..

భారత్ లో ఎక్కువ శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయి. అందులో ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మరో విధానాన్ని నేడు (ఆగస్టు 2) సాయంత్రం ప్రదాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. దీనిలో ముఖ్యంగా ఒక క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి ఓ వోచర్ పంపిస్తారు. గూగుల్‌ పే, యూపీఐ, ఫోన్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల వలే ఇ-రూపీ ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫారం కాదు.

ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వీటినే ఇ-రుపీగా భావిస్తారు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి బ్యాంక్, డిజిటల్ యప్ లాంటివి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఈ ఓచర్లను జారీ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. వారికి మనకు వచ్చే డబ్బు ఎంతో తెలియజేసి.. ఫోన్ నంబర్ తో సహా వివరాలను చెప్పాల్సి ఉంటుంది.

అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారు దానికి సంబంధించిన వోచర్ కోడ్ చెబితే రిడీమ్వ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మనకు పంపించి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరికి డబ్బులు చేరాలో వారి అకౌంట్లో పడిపోతాయి. ప్రస్తుతం అమెరికా విద్యావ్యవస్థలో ఈ- ఓచర్ల విధానం అమల్లో ఉంది. పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వవ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కేదార్‌నాథ్‌లో కఠిన నిబంధనలు.. ఫోటోలు, రీల్స్‌కు పూర్తి నిషేధం!

హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…

2 seconds ago

డబ్బు సమస్యల నుంచి బయటపడాలా? గురువారం ఈ ఆచారాలు ట్రై చేయండి!

జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…

7 minutes ago

గోండ్ vs గోండ్ కటిరా..! ఏది వేడి, ఏది చల్లదనం ఇస్తుందో తెలుసా?

ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…

15 minutes ago

కళ్లద్దాలకు గుడ్‌బై..! లాసిక్‌తో క్లియర్ విజన్ సాధ్యం!

ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…

22 minutes ago

మాటల కంటే మౌనం గొప్పది..! చాణక్యుడి ఐదు కీలక జీవన సూత్రాలు!

ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…

30 minutes ago

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

2 hours ago