Featured

టైప్ -2 డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆహారంలో ఇదొక భాగంగా చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలను 12 నుంచి 15 శాతం తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతో దోహదపడతాయని.. ‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడించారు.

ఇటీవల The International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మధుమేహాన్ని నియంత్రించడంలో చిరుధాన్యాలు ఉపయోగపడతాయని.. భారత జాతీయ పోషకాహార బోర్డు ప్రతినిధి, పరిశోధకుడు డాక్టర్ రాజ్ భండారి తెలిపారు. మధుమేహం అనేది 1990 నుంచి 2006 మధ్య వేగంగా పెరిగిందని.. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వ్యాధి (GBD) గ్లోబల్ బర్డెన్ ఆఫ్ నివేదిక ప్రకారం వెల్లడైంది.

డయాబెటిస్ కేసులు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇండియా, చైనా, అమెరికాలో అత్యధికంగా ఉన్నాయని.. ఇంటర్నేషనల్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించింది. దీనిని నివారించడానికి మాత్రం సలువైన మార్గం లేదని.. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేయడంతో దీనిని నియంత్రించవచ్చని హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు.

అయితే ప్రస్తుతం వెల్లడించిన పరిశోధన ఫలితాల్లో మాత్రం సామాన్యులకు, ప్రభుత్వాలనకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రతీ రోజు వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడంతో ఎంతో కొంత మధుమేహాన్ని నివారించవచ్చు అని డాక్టర్ హేమలత తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago