తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రోజురోజుకూ ఆసక్తిని రేపుతోంది. అందులో అడుగుపెట్టిన 19 మందిలో చివరకు 10 మంది మిగిలారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూంలో ఉన్నారు. ఇక మిగిలిన 9 మందిలో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు 5 గురు నామినేట్ అయ్యారు.
అందులో సిరి, రవి, కాజల్, మానస్ మరియు సన్నీ ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలో ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆ షోలో లేడీ గెటప్ లో బజర్దస్త్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సాయి తేజ. ఆ తర్వాత అతడు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు.
ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు తన సపోర్టు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్ర ముఖి సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ఎవరో తమకు తెలియదని.. కామెంట్స్ చేశారు.
ఆమెను కేవలం టీవీలో మాత్రమే చూస్తున్నామని.. అది కూడా ఆమె సాయిగానే తెలుసు అని చెప్పారు. ఇలా అమ్మాయిగా మారి ట్రాన్స్జెండర్ అయ్యారన్న విషయం తెలిదన్నారు. గతంలో తమన్నా బిగ్ బాస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు తమ సపోర్టు ఇచ్చామని.. ఆమె మా కమ్యూనిటీలో భాగంగా ఉన్నారని అందుకే ఇచ్చామన్నారు. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ కు తమ సపోర్టు ఉండదని చెప్పేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…