Featured

Producer Adhisheshagiri rao : కృష్ణ గారి పార్ధివ దేహాం అందరు వదిలి వెళ్ళడానికి గల కారణాలు…. గచ్చిబౌలి స్టేడియం లో కృష్ణ గారిని ఎందుకు పెట్టలేదంటే….: ప్రొడ్యూసర్ అధిశేషగిరి రావు

Producer Adhisheshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అధిశేషగిరి రావు గారు. అన్న కృష్ణ గారిజి తోడుగా ప్రతి విషయంలోనూ ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. పద్మాలయా స్టూడియోస్ కట్టాక ఆ స్టూడియో బాధ్యతలను ఆయనే చూసుకుంటూ కృష్ణ గారి ఓన్ ప్రొడక్షన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. నటనలో కృష్ణ గారు నిర్మాణ రంగంలో అధిశేష గిరి రావు గారు అలాగే ప్రొడక్షన్ లో హనుమంత రావు గారు ఇలా ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలో ఉండేవారు. ఇక కృష్ణ గారి కుటుంబంలో గతేడాది వరుసగా ముగ్గురు మరణించారు. రమేష్ బాబు గారు మరణించిన కొద్ది నెలలకు ఇందిర గారు ఆ తరువాత కృష్ణ గారు మరణించారు. అలా వరుస విషాదాల తరువాత మొదటి సారి ఇంటర్వ్యూ లో మాట్లాడారు అధిశేషగిరి రావు గారు. కృష్ణ మరణం తరువాత జరిగిన సంఘటనలను వివరించారు.

కృష్ణ గారి పార్ధివ దేహం వద్ద ఎవరు లేరన్నది అపద్ధం….

ఇక కృష్ణ గారి అంతిమ వీడ్కోలు సమయంలో అభిమానుల సందర్శనం కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం లో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. ఎక్కడినుండో కృష్ణ గారిని చూడటానికి అభిమానులు వచ్చారు. అంతలా అభిమానులు వస్తారని ఎవరు ఊహించలేదు కూడా. అయితే వచ్చిన అభిమానులకి నిరాశ్ మిగిలింది. ఆయనను కడసారి చూసే అవకాశం అందరికి కలుగలేదు. ఈ విషయం గురించి కృష్ణ గారి సోదరుడు అధిశేషగిరి రావు గారు మాట్లాడుతూ ఆయన పార్ధివ దేహాన్ని మొదట గచ్చిబోలి కి తరలించాలని అనుకున్న ఆయన శరీరం ను అక్కడికి ఇక్కడికి తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెప్పడం వల్ల అక్కడికి తరలించలేదు అని చెప్పారు. ఇక కృష్ణ గారి శవం వద్ద రాత్రి ఎవరూ లేరనేది అవాస్తవం నా కొడుకు, మేనల్లుడు ఉన్నారు అంటూ చెప్పారు.

పద్మాలయా అంటే కృష్ణ గారికి ఇష్టం అందుకే అక్కడికి తరలించామని చెప్పారు. రాత్రి తొమ్మిది తరువాత ఆయనను చూడటానికి వచ్చిన వారిని అనుమతించలేదు, ఇది పోలీసుల నిర్ణయం అంటూ చెప్పారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయాలని కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకున్నాం. ఆయన గుర్తుగా పద్మాలయాలో ఘాట్ నిర్మాణం చేస్తాము అంటూ చెప్పారు అధిశేషగిరి రావు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago