Senior Actor Naresh : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరు, ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరు తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళుప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచ్చకీడ్చింది. ఈ ఇష్యూ అంత తెగ వైరల్ అయి ఈ మధ్యనే సైలెంట్ అవ్వగానే తాజాగా మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ ,పవిత్ర లోకేష్ సినిమా చేసారు.
మా ప్రేమ అలా మొదలయింది…..
నరేష్ పవిత్ర లోకేష్ ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు చెప్పకర్లేదు. అయితే తాజాగా వేరే వారి ప్రేమకతను సినిమాగా తీసి మళ్ళీ పెళ్లి అంటూ విడుదల చేసారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీళ్ళు వాళ్ళ ప్రేమకథ గురించి తొలిసారి మాట్లాడారు. కోనేళ్ల క్రితం సినిమా షూటింగ్ లో తనని చూసినా అసలు మాట్లాడేది కాదు సైలెంట్ గా ఉండటం చూసి పొగరేమో అనుకున్న అంటూ నరేష్ తెలిపారు. ఇక సమ్మోహనము సినిమా టైం కి మా మధ్య పరిచయం పెరిగిందని మెసెజెస్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ వచ్చిందంటూ చెప్పారు. ఇక సమ్మోహనం సినిమా టైం లో తనకి ప్రపోజ్ చేసానని తన లైఫ్ గురించి నా లైఫ్ గురించి తనకు అన్నివిషయాలు తెలియడం వల్ల నేను ధైర్యంగా చెప్పగాలిగాను అంటూ చెప్పారు.
ఇక పవిత్ర మాత్రం ప్రపోజ్ చేస్తే ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆ రోజు నిద్రపట్టలేదంటూ చెప్పారు. ఇక ఆ ఇయర్చివరి రోజున నీ సమాధానం ఏమిటో చెప్పు అని అడిగే సరికి చెబుతా అంటూ సాయంత్రం తన ప్రేమను చెప్పేసింది. ఇక తనలో మా అమ్మను చుసుకున్నాను తను చాలా బాగా వండుతుంది. అందుకే నేను ఎక్కువ కనెక్ట్ అయ్యానని చెప్పారు. ఇక పవిత్ర మాట్లాడుతూ తనని ఎందుకు ఇష్టపడుతున్నది ఇప్పటికీ తనకి చెప్పలేదని అది నాకు తెలియదని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…