Producer Chittibabu : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణిజయరాం. తమిళనాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ’ సినిమాలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాం కు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న కిందకి పడి దురదృష్టవశాత్తు మరణించారు.
లతా మంగేష్కర్ తొక్కేసిందా…
చిట్టిబాబు గారు వాణి జయరాం గురించి మాట్లాడుతూ సౌత్ లోనూ నార్త్ లోనూ ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ చెప్పారు. మరీ ముఖ్యంగా టాలెంట్ తో నార్త్ కి వెళ్ళినపుడు అక్కడ లత మంగేష్కర్ వాణి జయరాం కు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడి అవకాశాలు ఆమెకు ఇవ్వకుండా చేసారని, లోకల్ లో ఉన్న తనకు కాకుండా సౌత్ నుండి వచ్చిన ఆమెకు అవకాశం ఎలా ఇస్తారని అడిగి వాణి జయరాం కు అవకాశాలు లేకుండా చేసారని చిట్టిబాబు తెలిపారు.
ఒకవేళ ఆమె ప్రతిభ ఆధారంగా ఆమెకు అవకాశాలు వచ్చుంటే లతా మంగేష్కర్ తో సమాన స్థాయిలో లేదా ఆమె కంటే మంచి స్థాయిలో వాణి జయరాం ఉండేవారంటూ తెలిపారు. ఇక సౌత్ లో పాటలు బాగానే పాడినా ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కే ఆమెను పరిమితం చేసారు అంటూ చెప్పారు. అయినా ఆమె ఎన్నో వేల పాటలు పాడి ప్రజల గుండెల్లో నిలిచి పోయారంటూ తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…