Producer Chittibabu : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణిజయరాం. తమిళనాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ’ సినిమాలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాం కు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న కిందకి పడి దురదృష్టవశాత్తు మరణించారు.
లతా మంగేష్కర్ తొక్కేసిందా…
చిట్టిబాబు గారు వాణి జయరాం గురించి మాట్లాడుతూ సౌత్ లోనూ నార్త్ లోనూ ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ చెప్పారు. మరీ ముఖ్యంగా టాలెంట్ తో నార్త్ కి వెళ్ళినపుడు అక్కడ లత మంగేష్కర్ వాణి జయరాం కు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడి అవకాశాలు ఆమెకు ఇవ్వకుండా చేసారని, లోకల్ లో ఉన్న తనకు కాకుండా సౌత్ నుండి వచ్చిన ఆమెకు అవకాశం ఎలా ఇస్తారని అడిగి వాణి జయరాం కు అవకాశాలు లేకుండా చేసారని చిట్టిబాబు తెలిపారు.
ఒకవేళ ఆమె ప్రతిభ ఆధారంగా ఆమెకు అవకాశాలు వచ్చుంటే లతా మంగేష్కర్ తో సమాన స్థాయిలో లేదా ఆమె కంటే మంచి స్థాయిలో వాణి జయరాం ఉండేవారంటూ తెలిపారు. ఇక సౌత్ లో పాటలు బాగానే పాడినా ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కే ఆమెను పరిమితం చేసారు అంటూ చెప్పారు. అయినా ఆమె ఎన్నో వేల పాటలు పాడి ప్రజల గుండెల్లో నిలిచి పోయారంటూ తెలిపారు.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…