Producer Chittibabu : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణిజయరాం. తమిళనాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ’ సినిమాలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాం కు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న కిందకి పడి దురదృష్టవశాత్తు మరణించారు.
లతా మంగేష్కర్ తొక్కేసిందా…
చిట్టిబాబు గారు వాణి జయరాం గురించి మాట్లాడుతూ సౌత్ లోనూ నార్త్ లోనూ ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ చెప్పారు. మరీ ముఖ్యంగా టాలెంట్ తో నార్త్ కి వెళ్ళినపుడు అక్కడ లత మంగేష్కర్ వాణి జయరాం కు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడి అవకాశాలు ఆమెకు ఇవ్వకుండా చేసారని, లోకల్ లో ఉన్న తనకు కాకుండా సౌత్ నుండి వచ్చిన ఆమెకు అవకాశం ఎలా ఇస్తారని అడిగి వాణి జయరాం కు అవకాశాలు లేకుండా చేసారని చిట్టిబాబు తెలిపారు.
ఒకవేళ ఆమె ప్రతిభ ఆధారంగా ఆమెకు అవకాశాలు వచ్చుంటే లతా మంగేష్కర్ తో సమాన స్థాయిలో లేదా ఆమె కంటే మంచి స్థాయిలో వాణి జయరాం ఉండేవారంటూ తెలిపారు. ఇక సౌత్ లో పాటలు బాగానే పాడినా ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కే ఆమెను పరిమితం చేసారు అంటూ చెప్పారు. అయినా ఆమె ఎన్నో వేల పాటలు పాడి ప్రజల గుండెల్లో నిలిచి పోయారంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…