Producer Pokuri Babu Rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీ లోనే పరిచయం దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారీ, ప్రజాశ్వమ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం, కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.
ఏఎన్ఆర్ గారు అలా అనేసరికి షాక్ అయ్యాను….
పోకూరి బాబు రావు గారు నిర్మాతగా సినిమాలను నిర్మించడమే కాకుండా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అందులో నవయుగం, ప్రేమ తపస్సు వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. అయితే రగులుతున్న భారతం సినిమా కోసం ఒక పాత్రకు అడుగగా ఆ సినిమాలో నాగేశ్వరావు గారు, దాసరి గారు ఉన్నారని ఒప్పుకున్నారట పోకూరి బాబురావు.
ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరావు గారికి పోకూరి గారిని ఆ సినిమా నిర్మాత పరిచయం చేయగా “ఎందుకు ఆర్టిస్ట్ అయ్యారు శుభ్రంగా సినిమాలు నిర్మించుకోవచ్చు కాదా, ఓ నిర్మాత ఆర్టిస్ట్ అయితే ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి దండం పెట్టి పిల్చుకురావాల్సిన పనిలేదనా” అంటూ చమత్కరించారట. అయితే పోకూరి గారు మాత్రం అన్నింటికి సమాదానంగా నవ్వారట . ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా ఉన్న దివ్య వాణిని రేప్ చేసే సీన్ ఉండగా నాగేశ్వరావు గారు ఏంటి విలన్ గారు నెక్స్ట్ రేప్ సీన్ అంటకదా బాగా చేయండి రేప్ అని చెప్పి వెళ్లారట. అలానేసరికి పోకూరి బాబురావు గారు బాగా షాక్ లో ఉండిపోయారట.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…