Producer Pokuri Baburao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం, దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.
యజ్ఞం సినిమాకు గోపీచంద్ హీరోగా ఎలా వచ్చాడంటే…
టి కృష్ణ గారితో ఉన్న అనుబంధం వల్ల పోకూరి బాబురావు కుటుంబం అలాగే హీరో గోపీచంద్ కుటుంబం సన్నిహితంగా ఉండేవారట. పోకూరి బాబురావు గారిని బాబాయ్ అంటూ పిలవడం గోపి చంద్ కి అలవాటు. గోపించంద్ మొదటి సినిమా ‘తొలివలపు’ ఫ్లాప్ అయినపుడు నెక్స్ట్ చేయాలని అనుకుంటున్న సమయంలో డైరెక్టర్ తేజ తో ఒక సినిమా చేయించాలని పోకూరి బాబు రావు గారు అనుకున్నారట. తేజ కూడా కృష్ణ గారి వద్ద పనిచేయడం వల్ల ఆయన కొడుకుతో సినిమా చేస్తానని చెప్పడంతో అయన ను అప్పుడప్పుడు కలవమని చెప్పారట. అదే సమయంలో పోకూరి బాబురావు గారు ఆయన నెక్స్ట్ సినిమా కే ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేయాలని అనుకుని ‘యజ్ఞం’ సినిమా స్టోరీ ప్రభాస్ కి చెప్పగా నచ్చి ప్రభాస్ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ డైరెక్టర్ ను మార్చమని చెప్పారట.
ఆ విషయం నచ్చని పోకూరి గారు సరిగ్గా అదే సమయానికి వచ్చిన గోపీచంద్ ను చూసి ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికాను అనుకుని గోపి ఈ సినిమా చేద్దాం అని స్టోరీ చెప్పగా మొదట డైరెక్టర్ విషయంలో అనుమానపడినా చివరకు గోపీచంద్ యజ్ఞం సినిమా చేశారట. అలా మంచి హిట్ అందుకున్న గోపీచంద్ మరో వైపు విలన్ గా కూడా ఈ గ్యాప్ లో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక మంచి హిట్స్ వచ్చి ‘రణం’ తరువాత మార్కెట్ పెరిగాక గోపి విభిన్నంగా కథలను చేస్తున్నాడని, మా ఇద్దరి కాంబినేషన్ వర్క్ అవుట్ కాలేదని, అయితే నాకు మాత్రం గోపీచంద్ ను ఒక మాస్ క్యారెక్టర్ లో చూడాలని ఉంది అంటూ చెప్పారు పోకూరి బాబు రావు గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…