Mrunal Thakur: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సమంత, నయనతార స్టార్ హీరోయిన్లుగా మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవల సీతారామం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.మొదటి సినిమాకే ఇంత క్రేజ్ రావటం మృణాల్కు మాత్రమే సాధ్యమైంది. సీతారామం సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇలా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ కి అవకాశాలు వరుస క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారని కూడా మించిపోయిందని తెలుస్తోంది. సీతారామం సినిమాకి రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మృణాల్ నానితో నటించబోతున్న సినిమాకి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. .ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న సమంత, నయనతార రెమ్యూనరేషన్ కూడా ఆరు కోట్లకు లోపే ఉంటుంది.
మృణాల్ మాత్రం ప్రస్తుతం సౌత్ లో తనకు ఉన్న డిమాండ్ బట్టి 6 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి మృణాల్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…