Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల బైక్ ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ కొంతకాలం ఇంటికే పరిమితం అయ్యాడు. ఇక ఇటీవల అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్ పనులతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమాలో నటించి ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. సినిమా విశేషాలతోపాటు తనకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో జరిగిన సంఘటనల గురించి కూడా ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఓ సందేశం గురించి సాయి ధరమ్ తేజ్ బయటపెట్టాడు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..”యాక్సిడెంట్ తర్వాత మామయ్య (చిరంజీవి) నుంచి ఓ సందేశం వచ్చింది. అదేమిటంటే.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి` అనే లైన్ని తనకు సందేశం పంపినట్టు ధరమ్ తేజ్ వెల్లడించాడు
ఆ ఒక్క లైన్ తనని ఎంతో ఇన్స్పైర్ చేసిందని, తనలో కసిని పెంచి…. తాను మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు ఆ మాట ఎంతో దోహదపడిందని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. జీవితం అంటే సుఖ సంతోషాలతో పాటు కష్టాలు కూడా వస్తాయి. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను చూసి భయపడితే జీవితమే లేదని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. యాక్సిడెంట్స్ తర్వాత తన జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయని, ఆ యాక్సిడెంట్స్ తనకు ఒక స్వీట్ మెమరీ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…