Producer Prasanna Kumar : ఈ అవార్డుతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు…: నిర్మాత ప్రసన్న కుమార్

Producer Prasanna Kumar : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడారు, ఆయన ఆనందాన్ని పంచుకున్నారు.

తెలుగు జాతి గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పారు…

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ టీం అంతా తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసారు అంటూ ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డారు. పాట ఈసిన చంద్రబోస్ గారు పాట కంపోజ్ చేసిన కీరవాణి గారు ఆస్కార్ అందుకుని తెలుగు పాట గౌరవాన్నీ పెంచారు.

రాజమౌళి తో సహ హీరోలిద్దరూ అలాగే కొరియోగ్రఫర్ ఇంకా మొత్తం చిత్ర యూనిట్ సమిష్టి కృషి ఈ పాటకు అవార్డు రావడం అంటూ ప్రశంసించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టి తెలుగోడికి గుర్తింపు తెస్తే ఇప్పుడు ఆర్ఆర్ సినిమా టీం తెలుగువాడిని ప్రపంచం గుర్తించేలాగా చేసారు అంటూ అభిప్రాయపడ్డారు.