Pruthvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో డైలాగుతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ, చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అందరినీ నవ్వించారు. ఇక చాలా సీరియస్ గా 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరుపున ప్రచారం చేసాడు. అధికారంలోకి వైసీపీ రాగానే పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ ఎస్విబిసి చైర్మన్ గా నియమించి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఆ పదవిని ఎక్కువ రోజులు నిలుపుకోలేక పోయాడు పృథ్వీ.
సిగ్గుండాలి వైసీపీ లోకి వెళ్లే వారికి…
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పదవి కాస్త ఉడిపోయి పరువు పోయింది. నామీద నిందారోపణలు చేస్తున్నారంటు పృథ్వీ చెప్పిన వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తాజాగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైసీపీ నుండి, జనసేనకు జంప్ కొడతాడేమో అనేలా మాట్లాడుతున్నాడు. వైసీపీ నుండి పిలుపొస్తే వెళ్తారా అని అడుగగా ఇక చాలండి… నమస్కారమండి.. అంటాను. వైసీపీ లోకి వెళ్లే వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలి. కులం ప్రస్తావన ఎపుడు నేను తీసుకురాలేదు. కానీ మొదటిసారి చెబుతున్నా, తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగి గ్రామంలో పుట్టిన కాపు వాడిగా చెబుతున్నా, మా జాతి వాడెవడు ఆ పని చేయడు. అంటూ ఖరాఖండీగా వైసీపీ వైపు వెళ్లనని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. ఇక జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడంటున్నారు.
నీయమ్మ… 10 సీట్లు కాదు వచ్చే ఎన్నికలలో 40 సీట్లు గెలుస్తాం… జనసేన జండా రాబోయే రోజుల్లో ఎగరబోతోంది నేను రాసిస్తాను.. అని నేను ఘంటాపథంగా చెప్పగలను 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్ అంటూ మాట్లాడారు పృథ్వీ. ఇక ఈ మాటలు ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో పృథ్వీ జనసేన లోకి జంప్ అవుతాడు అనే మాటలకు మరింత బలం చేరింది. త్వరలోనే జనసేన ఖండువా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కప్పుకుంటాడన్నమాట.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…