Pruthvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో డైలాగుతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ, చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అందరినీ నవ్వించారు. ఇక చాలా సీరియస్ గా 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరుపున ప్రచారం చేసాడు. అధికారంలోకి వైసీపీ రాగానే పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ ఎస్విబిసి చైర్మన్ గా నియమించి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఆ పదవిని ఎక్కువ రోజులు నిలుపుకోలేక పోయాడు పృథ్వీ.
సిగ్గుండాలి వైసీపీ లోకి వెళ్లే వారికి…
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పదవి కాస్త ఉడిపోయి పరువు పోయింది. నామీద నిందారోపణలు చేస్తున్నారంటు పృథ్వీ చెప్పిన వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తాజాగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైసీపీ నుండి, జనసేనకు జంప్ కొడతాడేమో అనేలా మాట్లాడుతున్నాడు. వైసీపీ నుండి పిలుపొస్తే వెళ్తారా అని అడుగగా ఇక చాలండి… నమస్కారమండి.. అంటాను. వైసీపీ లోకి వెళ్లే వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలి. కులం ప్రస్తావన ఎపుడు నేను తీసుకురాలేదు. కానీ మొదటిసారి చెబుతున్నా, తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగి గ్రామంలో పుట్టిన కాపు వాడిగా చెబుతున్నా, మా జాతి వాడెవడు ఆ పని చేయడు. అంటూ ఖరాఖండీగా వైసీపీ వైపు వెళ్లనని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. ఇక జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడంటున్నారు.
నీయమ్మ… 10 సీట్లు కాదు వచ్చే ఎన్నికలలో 40 సీట్లు గెలుస్తాం… జనసేన జండా రాబోయే రోజుల్లో ఎగరబోతోంది నేను రాసిస్తాను.. అని నేను ఘంటాపథంగా చెప్పగలను 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్ అంటూ మాట్లాడారు పృథ్వీ. ఇక ఈ మాటలు ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో పృథ్వీ జనసేన లోకి జంప్ అవుతాడు అనే మాటలకు మరింత బలం చేరింది. త్వరలోనే జనసేన ఖండువా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కప్పుకుంటాడన్నమాట.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…