Pruthvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో డైలాగుతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ, చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అందరినీ నవ్వించారు. ఇక చాలా సీరియస్ గా 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరుపున ప్రచారం చేసాడు. అధికారంలోకి వైసీపీ రాగానే పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ ఎస్విబిసి చైర్మన్ గా నియమించి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఆ పదవిని ఎక్కువ రోజులు నిలుపుకోలేక పోయాడు పృథ్వీ.
సిగ్గుండాలి వైసీపీ లోకి వెళ్లే వారికి…
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పదవి కాస్త ఉడిపోయి పరువు పోయింది. నామీద నిందారోపణలు చేస్తున్నారంటు పృథ్వీ చెప్పిన వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తాజాగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైసీపీ నుండి, జనసేనకు జంప్ కొడతాడేమో అనేలా మాట్లాడుతున్నాడు. వైసీపీ నుండి పిలుపొస్తే వెళ్తారా అని అడుగగా ఇక చాలండి… నమస్కారమండి.. అంటాను. వైసీపీ లోకి వెళ్లే వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలి. కులం ప్రస్తావన ఎపుడు నేను తీసుకురాలేదు. కానీ మొదటిసారి చెబుతున్నా, తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగి గ్రామంలో పుట్టిన కాపు వాడిగా చెబుతున్నా, మా జాతి వాడెవడు ఆ పని చేయడు. అంటూ ఖరాఖండీగా వైసీపీ వైపు వెళ్లనని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. ఇక జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడంటున్నారు.
నీయమ్మ… 10 సీట్లు కాదు వచ్చే ఎన్నికలలో 40 సీట్లు గెలుస్తాం… జనసేన జండా రాబోయే రోజుల్లో ఎగరబోతోంది నేను రాసిస్తాను.. అని నేను ఘంటాపథంగా చెప్పగలను 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్ అంటూ మాట్లాడారు పృథ్వీ. ఇక ఈ మాటలు ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో పృథ్వీ జనసేన లోకి జంప్ అవుతాడు అనే మాటలకు మరింత బలం చేరింది. త్వరలోనే జనసేన ఖండువా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కప్పుకుంటాడన్నమాట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…