Akash Puri: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు డైరెక్టర్ గా మాత్రమే ఉన్నటువంటి పూరి ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలసి సినిమాలను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరు కలిసే కూడా ముంబైలో నివసించడం అదేవిధంగా ఇద్దరు కలిసి పలు పార్టీలకు హాజరవుతూ కనిపించడంతో గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వార్తలు రావడమే కాకుండా ఛార్మి కోసం పూరి జగన్నాథ్ విడాకులిచ్చాడని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ..నాన్న తన సినీ కెరీర్లో ఎంతో నష్టపోయాడు అయితే అమ్మ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ విషయాలు మాకు తెలియకుండా మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు.
నాన్న ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మ నాన్నకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఇల్లు కార్లు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం అమ్మే. మా అమ్మ నాన్నల విడాకుల గురించి తాను ఇప్పటివరకు ఒక్క సారి కూడా వినలేదని,పని పాట లేని వాళ్ళు ఇలాంటి వార్తలు సృష్టిస్తూ ఉంటారని ఆకాశ్ తన తండ్రి గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
నిజం చెప్పాలంటే అమ్మానాన్నలది ఇద్దరిదీ ప్రేమ వివాహం.నాన్న ఒక రోజు ఫోన్ చేసి తనని పెళ్లి చేసుకుంటావా అడిగినప్పుడు అమ్మ తనతో పాటు వచ్చిందని,తన జోబులో కేవలం 200 మాత్రమే ఉన్నాయి రేపు ఎలా ఉంటుందో తెలియదు అని నాన్న చెప్పిన అవన్నీ ఆలోచించకుండా అమ్మ తనతో పాటు వచ్చి తనని పెళ్లి చేసుకుందని వారిద్దరి మధ్య అంత ప్రేమ ఉందని ఆకాష్ ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ వారి గురించి వస్తున్న విడాకుల ఈ వార్తలపై స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…