Akash Puri: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు డైరెక్టర్ గా మాత్రమే ఉన్నటువంటి పూరి ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలసి సినిమాలను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరు కలిసే కూడా ముంబైలో నివసించడం అదేవిధంగా ఇద్దరు కలిసి పలు పార్టీలకు హాజరవుతూ కనిపించడంతో గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వార్తలు రావడమే కాకుండా ఛార్మి కోసం పూరి జగన్నాథ్ విడాకులిచ్చాడని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ..నాన్న తన సినీ కెరీర్లో ఎంతో నష్టపోయాడు అయితే అమ్మ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ విషయాలు మాకు తెలియకుండా మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు.
నాన్న ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మ నాన్నకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఇల్లు కార్లు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం అమ్మే. మా అమ్మ నాన్నల విడాకుల గురించి తాను ఇప్పటివరకు ఒక్క సారి కూడా వినలేదని,పని పాట లేని వాళ్ళు ఇలాంటి వార్తలు సృష్టిస్తూ ఉంటారని ఆకాశ్ తన తండ్రి గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
నిజం చెప్పాలంటే అమ్మానాన్నలది ఇద్దరిదీ ప్రేమ వివాహం.నాన్న ఒక రోజు ఫోన్ చేసి తనని పెళ్లి చేసుకుంటావా అడిగినప్పుడు అమ్మ తనతో పాటు వచ్చిందని,తన జోబులో కేవలం 200 మాత్రమే ఉన్నాయి రేపు ఎలా ఉంటుందో తెలియదు అని నాన్న చెప్పిన అవన్నీ ఆలోచించకుండా అమ్మ తనతో పాటు వచ్చి తనని పెళ్లి చేసుకుందని వారిద్దరి మధ్య అంత ప్రేమ ఉందని ఆకాష్ ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ వారి గురించి వస్తున్న విడాకుల ఈ వార్తలపై స్పందించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…