కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు. ఆయన గుండెపోటుతో నేడు మరణించడంతో ఈ వార్తను అభిమానులు, సినీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు సినీ నటులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా పునీత్ తన అద్భుతమైన నటనతో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకొని కన్నడనాట సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే నటుడు పునీత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఈయనను ఇండస్ట్రీకి పరిచయం చేసినది డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పాలి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు ఎలాగో కన్నడ సినీ పరిశ్రమకు నటుడు రాజ్ కుమార్ అలాగా. ఆయన వారసుడిగా పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీలోకి ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేయవచ్చు. కానీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయించారు.
పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలో చూసిన రాజ్ కుమార్ ఎంతో ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా తర్వాత తన కుమారుడిని పూరీ జగన్నాథ్ తో లాంచ్ చేయాలని భావించారట. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ డెబ్యూ మూవీగా “అప్పు” అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కన్నడనాట ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ చిత్రంగా నిలిచింది.
ఇక అప్పు సినిమా తర్వాత దీనిని తెలుగులో రీమేక్ చేసి పూరీజగన్నాథ్ ఇడియట్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పునీత్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలవాడు.స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు తను ఎప్పటికీ శిష్యుడేనని ఎన్నోమార్లు వెల్లడించారు. ఇలా స్టార్ హీరోగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ మరణించడంతో పలువురు తెలుగు నటీనటులు కూడా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…