దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లు, సాంగ్ లు రిలీజ్ చేయగా ఇవి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సామీ సాంగ్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినిపిస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్టు పార్టుకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన 10 శాతం చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.ఆయన ఫస్టులుక్ కు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే.అయితే ఆయన ఫస్టు పార్టు చివరలో, కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో తెరపై ప్రత్యక్షమవుతాడట సెకండ్ పార్టు కోసం వెయిట్ చేసేలా చేస్తారని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా ఫస్టు పార్టులో సునీల్ విలన్గా కనిపించనున్నాడట.ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంలో తన రోల్ గురించి తెలిపాడు సునీల్.ఇందులో తనకుమంచి పాత్ర దొరికిందని అన్నాడు.రామ్ చరణ్ సినిమాతో పాటు గా మంచి పాత్రలు తనకు దొరుకుతున్నాయని తెలిపారు.ఇక సునీల్ రీసెంట్గా హెడ్స్ అండ్ టేల్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సునీల్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హెడ్స్ అండ్ టేల్స్,‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఈ సినిమాకు నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ 5 లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…