కొంతమంది అనతి కాలంలోనే పెద్ద స్టార్స్ అయిపోతుంటారు. మరికొంత మంది చిన్నతనం నుంచి కష్టపడుతూ.. ఒకానొక దశకు వచ్చేసరికి వాళ్లకు తిరుగు లేకుండా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి బాగా జరుగుతాయి. సీనియర్ ఆర్టిస్టు అయిన శ్రుతి.. అప్పట్లో సీరియల్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
అంతే కాకుండా ఆమె కోసం సీరియల్ డైరెక్టర్స్ సైతం తమ డేట్స్ ను మార్చుకున్నారంటే అర్థం చేసుకోవాలి.. ఆమె అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారని. ఆమె ఒక్క సినీ ఆర్టిస్టుగానే కాకుండా రేటియో జాకీగా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. దూరదర్శన్ లో రుతురాగాలు సీరియల్ ఆమె కెరీర్ కు ఒక మైలు రాయి అని చెప్పుకోవచ్చు.
దాని తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికే ఆమె చదువుకుంటుండగా.. చదువుకు ఇబ్బంది అవుతుందని ఆమె తల్లి నాగమణి సీరియల్ లో చేయవద్దు అని చెప్పిందట. అయినా వాళ్లు ఆమెకు సెలవులు ఉన్న సమయంలోనే చేయమని ఆఫర్ కూడా ఇచ్చారు. తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పట్లో దూరదర్శన్ లోని ఓ సీరియల్ ని డైరెక్ట్ చేసారు..
అప్పుడు శ్రుతి, పూరి కలిసి సీరియల్ చేశారు. తర్వాత ఆమె మొగలి రేకులు, నాగాస్త్రం , కన్యాశుల్కం, చంద్రముఖి, ఇంటింటి రామాయణం వంటి సూపర్ డూపర్ సీరియల్స్ లో నటించింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధమే ఉంది. అయితే అప్పట్లో పూరి జగన్నాథ్ మొదటి హీరోయిన్ గా చేసిన శ్రుతి.. ప్రస్తుతం బామ్మ అంటూ.. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…
పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై దృష్టి పెట్టడం అవసరం అవుతోంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే…
ఎండాకాలం వచ్చేసరికి శరీరానికి చల్లదనం కోసం చాలా మంది పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే…