Puri Jagannadh: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి తీసినటువంటి చిత్రం లైగర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకోగా చివరికి డిజాస్టర్ కావడంతో సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు పెద్ద ఎత్తున పూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వడానికి ఒక నెలరోజులు టైం కావాలని అడగగా కొందరు బయర్లు మాత్రం తమకు వెంటనే డబ్బు చెల్లించకపోతే ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇలా తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చే ప్రయత్నం చేస్తే తాను ఒక్క పైసా కూడా చెల్లించని పూరి జగన్నాథ్ బయ్యర్లకు చెప్పినటువంటి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అనంతరం పూరి జగన్నాథ్ తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను, ఫైనాన్షియర్ శోభన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వీరి వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని,వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విధంగా పూరి జగన్నాథ్ వరంగల్ శీను శోభన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరి కాస్త ముదిరిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై వరంగల్ శీను, ఫైనాన్షియర్ శోభన్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…