Categories: Featured

Puri Jagannadh: పూరి ఆఫీసు వద్ద ధర్నా చేయడానికి వస్తున్నారని నేనే వర్మకు మెసేజ్ పెట్టా.. నట్టి కుమార్ కామెంట్స్ వైరల్!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తమకు వెనక్కి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా చేయని పక్షంలో ధర్నాలు చేస్తామంటూ డిస్ట్రిబ్యూటర్లు పూరికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ వీడియో పై తాజాగా నిర్మాత నటి కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైజర్ సినిమాకి వరంగల్ శీను, శోభన్ వంటి వారు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. వీరికింద ఎంతో మంది ఎగ్జిబిటర్ లు ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి డిజాస్టర్ కావడంతో డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.

ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్లు కోరడంతో తనకు కొంత సమయం కావాలని తిరిగి డబ్బు చెల్లిస్తామని పూరి జగన్నాథ్ చెప్పారు. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉండడంతో పూరి జగన్నాథ్ ఇచ్చిన డబ్బులను డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే తీసుకొని ఎగ్జిబిటర్లకు ఇవ్వకుండా మోసం చేస్తారేమోనని భావించి కొందరు ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ను కలిసి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు ఇచ్చే సమయంలో తమకు కూడా సమాచారం అందించమని చెప్పాలని తన ఆఫీసు వద్దకు వెళ్లాలని భావించారు.

Puri Jagannadh: పరువు పోకూడదని పూరి ప్రయత్నం..


ఈ క్రమంలోనే కొందరు ధర్నా చేయడానికి వెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో చెప్పడంతో నేనే స్వయంగా పూరి జగన్నాథ్ ఆఫీస్ వద్దకు ఎగ్జిబిటర్లందరూ ధర్నా చేయడానికి వస్తున్నారంటూ రాంగోపాల్ వర్మకు చెప్పడం రాంగోపాల్ వర్మ పూరి జగన్నాథ్ కు మెసేజ్ పంపించడం జరిగింది అంటూ నట్టి కుమార్ వెల్లడించారు.తన పరువు పోకుండా ఉండడం కోసం పూరి జగన్నాథ్ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తానని చెప్పారు. అయితే తన పరువు తీసేలా ధర్నా చేస్తామని చెప్పడంతో ఈయన డబ్బును ఇవ్వనని తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా నటి కుమార్ వెల్లడించారు. అయితే కేవలం ఇక్కడ అపార్థం చోటు చేసుకోవడం వల్లే ఈ విషయం ఇలాంటి పరిణామాలకు దారి తీసిందని ఇలా ఎగ్జిబిటర్లు ఆచార్య సినిమా విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మోసపోవడం వల్లే ఈ విషయాన్ని పూరి వరకు చేర్చాలని భావించారని నట్టి కుమార్ క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

24 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

24 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

24 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

24 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

1 day ago