Puri Jagannadh: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈయన నటి చార్మితో కలిసి సినిమాలో నిర్మించడం వల్ల ఎక్కువగా ముంబైలో నివసిస్తున్నారు దీంతో తన భార్యకు పూరి జగన్నాథ్ విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు గురించి పరోక్షంగా బండ్ల గణేష్ సైతం పూరి జగన్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం మనకు తెలిసిందే.
ఇలా గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ వ్యక్తిగత విషయాల గురించి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు ఇకపోతే లైగర్ సినిమా ద్వారా భారీ నష్టాలను ఎదుర్కొన్నటువంటి పూరీ జగన్నాథ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈయన తన ఫ్యామిలీతో కలిసి సొంతూరికి వెళ్లారు.
ఈ క్రమంలోనే తన భార్యతో కలిసి పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తన కూతురు కొడుకుతో కలిసి ఈ పూజా కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.
ఇలా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్న వదిన అంటూ కామెంట్ పెట్టారు.ఈ విధంగా పూరి జగన్నాథ్ దంపతులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనడంతో వీరి విడాకుల వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…