Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!
Pushpa Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కొంత మంది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోగా మరికొందరు ఈ సినిమా పై విమర్శలు చేశారు.
ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఆ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అలాకాకుండా సమాజంలో యువత తప్పు దోవ పట్టించే విధంగా ఉండకూడదని గరికపాటి నరసింహారావు ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో ఒక స్మగ్లర్ ఆయన కూడా తగ్గేదిలే అంటూ స్మగ్లింగ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల సమాజానికి ఏమి తెలియచేస్తున్నారు అంటూ గరికపాటి ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా ఈయన ఈ సినిమా గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిజజీవితంలో కూడా ఈ సినిమాను చూసి ఇన్స్పయిర్ అయిన ఒక ట్రక్ డ్రైవర్ ఏకంగా గంధపుచెక్కల స్మగ్లింగ్ చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. యాసిన్ ఇనయితుల్లాఅనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తూ ఇటీవలే పుష్ప సినిమాను చూసిన తర్వాత తాను కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పథకం వేశాడు.
ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అతను స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మార్గమధ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతని నుంచి సుమారు 2.45 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 10 లక్షల వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇలా రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడంతో పుష్ప సినిమా ప్రభావం అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…