RRR Movie: సినీ జీవితంలో ఓటమి ఎరుగని విక్రమార్కుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ఏ ఒక్క సినిమా కూడా ఓటమిని చవిచూడలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం గర్వించేలా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమాపై దేశవ్యాప్తంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అయితే రాజమౌళిని జైలులో పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ విధంగా పలువురు ఈ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు సినిమా పై స్పందిస్తూ సినిమాల్లో పెద్దగా ఎమోషనల్ సన్నివేశాలు లేవని, సంగీత నేపథ్యం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అంటూ విమర్శలు కురిపించారు.ఈ కథను రచించడంలో విజయేంద్రప్రసాద్ తెరకెక్కించడంలో రాజమౌళి ఇద్దరు విఫలమయ్యారని కొందరు ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇలా ఈ సినిమా పై విమర్శలు రావడంతో పీవీపీ రంగంలోకి దిగి సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు.
ట్విట్టర్ వేదికగా పీవీపీ స్పందిస్తూ..కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి..
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు కనీసం ఒక తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు ఎలా తీయాలో మాత్రం చెబుతారు. సినీ ఇండస్ట్రీలో నీ కష్టాన్ని అపహాస్యం చేసే వారిపై తిరగబడండి అని చెప్పడమే కాకుండా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాసిన వెబ్ సైట్ పై కేసు వేయాలని ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…