God Father Movie: రెమ్యూనరేషన్ లేకుండా గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సల్మాన్… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
God Father Movie: మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్ చిరంజీవి మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు అయితే సల్మాన్ ఖాన్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు పూర్తి కావడంతో దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న అభిమానం కారణంగానే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.అదే విధంగా చరణ్ సినిమాకి సల్మాన్ సపోర్ట్ చేయడం, సల్మాన్ సినిమాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చరణ్ సల్మాన్ ఖాన్ మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని సమాచారం.ఈ విధంగా మెగా కుటుంబానికి సల్మాన్ ఖాన్ కి మధ్య మంచి అనుబంధం ఉండటం వల్ల ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారని తెలుస్తోంది.
చిరంజీవి సినిమా కోసం అడగగానే ఆయనపై ఉన్న గౌరవంతో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించారు. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ లూసీఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో నటించారు. మోహన్ లాల్ కి సమస్య ఎదురైనప్పుడు పృధ్విరాజ్ ఎంట్రీ ఇచ్చిన విధంగా ఈ సినిమాలో కూడా చిరంజీవి ఆపదలో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఈయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…