Radha Manohar Das : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మానవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇపుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసిపాపను కూడా వదలడం లేదు. ఒక్క రోజు పాపకు జాతకం అంటూ మెగా వంశాన్ని పాప జాతకం ఎలా మార్చాబోతోంది అంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల ఆస్ట్రాలజర్ గా చెప్పుకునే వేణుస్వామి మెగా వారసురాలి జాతకం చెప్పారు. అయితే ఈ ఇష్యూ గురించి మరో ఆస్ట్రాలజర్ రాధా మనోహర్ దాస్ మాట్లాడారు.
చిన్న పాపకు జాతకం చూడటం ఏమిటి…
పాప పుట్టి ఒకరోజైనా కాలేదు అపుడే పాప జాతకం చూడటం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ ఒక శివాలయంలో ఎపుడూ పూజ చేస్తుంటారు. అందువల్లే వాళ్ళింట్లో అమ్మవారు పుట్టిందని భావిస్తున్నాను అంటూ చెప్పారు. వేణుస్వామి వంటి వారు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పబ్లిసిటీ కోసం పసిపాపను కూడా వదలడం లేదు.
పాపకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఎలాంటి జాతకం చూడకూడదు అంటూ చెప్పారు. పసిపిల్లలు జాతకాలను చూడరు. వారి తల్లిదండ్రుల కుటుంబం సభ్యుల అనుమతి లేకుండానే సెలబ్రిటీల పిల్లలు కావడం వల్ల జాతకాలను సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు, అది తప్పు అంటూ రాధా మనోహర్ దాస్ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…