Radha Manohar Das : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మానవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇపుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసిపాపను కూడా వదలడం లేదు. ఒక్క రోజు పాపకు జాతకం అంటూ మెగా వంశాన్ని పాప జాతకం ఎలా మార్చాబోతోంది అంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల ఆస్ట్రాలజర్ గా చెప్పుకునే వేణుస్వామి మెగా వారసురాలి జాతకం చెప్పారు. అయితే ఈ ఇష్యూ గురించి మరో ఆస్ట్రాలజర్ రాధా మనోహర్ దాస్ మాట్లాడారు.
చిన్న పాపకు జాతకం చూడటం ఏమిటి…
పాప పుట్టి ఒకరోజైనా కాలేదు అపుడే పాప జాతకం చూడటం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ ఒక శివాలయంలో ఎపుడూ పూజ చేస్తుంటారు. అందువల్లే వాళ్ళింట్లో అమ్మవారు పుట్టిందని భావిస్తున్నాను అంటూ చెప్పారు. వేణుస్వామి వంటి వారు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పబ్లిసిటీ కోసం పసిపాపను కూడా వదలడం లేదు.
పాపకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఎలాంటి జాతకం చూడకూడదు అంటూ చెప్పారు. పసిపిల్లలు జాతకాలను చూడరు. వారి తల్లిదండ్రుల కుటుంబం సభ్యుల అనుమతి లేకుండానే సెలబ్రిటీల పిల్లలు కావడం వల్ల జాతకాలను సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు, అది తప్పు అంటూ రాధా మనోహర్ దాస్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…