Political News

Rahul Gandhi : భోపాల్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు – “నరేందర్… సరెండర్” అంటూ మోదీపై నిప్పులు!

Rahul Gandhi : పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లొంగిపోయారని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ ఫోన్ చేసి మోదీని బెదిరించారా?

ఆపరేషన్ సిందూర్ మొదలైన వెంటనే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మోదీజీ.. ఏం చేస్తున్నారు అని ట్రంప్ ఫోన్‌లో అడిగారు. ‘నరేందర్.. సరెండర్’ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను మోదీ తూచా తప్పకుండా పాటించారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

కాంగ్రెస్ ధైర్యానికి నిదర్శనం 1971 యుద్ధం

కాంగ్రెస్ పార్టీ గతంలో అగ్రరాజ్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నదని రాహుల్ గుర్తు చేశారు. “అమెరికా బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్‌ను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది, ఎప్పటికీ తలవంచదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే” అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎవరికీ తలవంచదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? దిగువ కామెంట్స్ లో తెలియజేయండి.

telugudesk

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

3 hours ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

5 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

5 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

5 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

5 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

5 hours ago