తెలుగు అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జక్కన ఫాన్స్ ఎదురుచూస్తున్నా సినిమా “ఆర్ఆర్ఆర్”. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్ లు అన్నిటికీ బ్రేక్ పడింది. మళ్ళి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. ఇటువంటి సమయంలో “ఆర్ఆర్ఆర్” విడుదలపై జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో జక్కన్న ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట.. అందులో ఈ వాయిదా విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతున్నాడట రాజమౌళి.
ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటుగా మరికొందరు విదేశీ నటులు, టెక్నిషియన్స్ భాగమైన విషయం తెలిసిందే. వీరంతా షూటింగ్లో పాల్గొనాలంటే భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయాలి. ఆ తరువాత గాని విదేశీ ఆర్టిస్టులు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి వీలుపడదు. ఇక ఆ తరువాత వచ్చే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయాలని జక్కన్న యోచిస్తున్నాడట.
మొదట్లో జులై 30న చేస్తామని చెప్పిన చిత్రం ఆ తరువాత నుంచి వాయిదా పడుతూ వచ్చింది. జులై 30న విడుదల చేస్తామని చెప్పారు.. ఆ తరువాత షూటింగ్ ఆలస్యమైన కారణంగా వచ్చే ఏడాది జనవరి 8 కి వాయిదా పడింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా మరో సారి వాయిదా పడబోతోంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…