Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఛత్రపతి ఈ సినిమాలో ప్రభాస్ శ్రేయ హీరో హీరోయిన్లుగా నటించారు. మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనాలను సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ స్టార్ హీరోగా కూడా మారిపోయారు.
ఇక ఈ సినిమాని డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రాజమౌళి ప్రత్యేక వీడియో ద్వారా చత్రపతి చిత్ర బృందానికి ఈయన ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ చత్రపతి సినిమా నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైనది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాస్ డైరెక్టర్లలో వివి వినాయక్ ఒకరు. ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో ఆదరణ కలిగిన నటుడు ఈ సినిమా తనకు కచ్చితంగా సరిపోతుందని రాజమౌళి తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి అంటూ ఈ సందర్భంగా రాజమౌళి ఈ చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది, ఈ సినిమా సాయి శ్రీనివాస్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…