Rajamouli: తండ్రి విజయేంద్ర ప్రసాద్ అలాంటి పనిచేయడంతో కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి… అసలేం జరిగిందంటే?
Rajamouli: ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ అందరికీ సుపరిచితమే. సినీ రచయితగా మాత్రమే కాకుండా రాజమౌళి తండ్రిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలన్నింటికీ కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. బాహుబలి 1,2 నుంచి నేడు విడుదలైన RRR వరకు ఈయన అద్భుతమైన కథను అందించారు.
ఈ విధంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమా కథలలోఒక సినిమా కథ విషయంలో రాజమౌళి చాలా హర్ట్ అయ్యారు అని ఆ రోజు తన తండ్రి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారు అని వెల్లడించారు. ఏం జరిగింది అనే విషయానికి వస్తే… విజయేంద్రప్రసాద్ రచించిన భజరంగీ భాయ్ జాన్ కథ సల్మాన్కు చెప్పాననగానే రాజమౌళి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు అని తెలిపారు.
ఆ విధంగా రాజమౌళి కళ్ళలో నీళ్ళు చూసి కథ మన దగ్గరే ఉంది చెయ్యనా అని చెప్పగా రాజమౌళి వద్దు వారికి ఇచ్చేయమని చెప్పారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరోజు రాజమౌళి తన వద్దకు వచ్చాడు.ఆ సమయంలో బాహుబలి సినిమా 2 వేల మంది ఆర్టిస్టులతో మంచి ఎండలో ఒక ఫైట్ సన్నివేశం జరుగుతుంది.
అలా బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మంచి కాక మీద ఉన్నప్పుడు రాజమౌళి తన వద్దకు వచ్చి 15 రోజుల ముందు లేదా తర్వాత అడిగి ఉంటే ఈ కథ నేను తీసేవాడిని కదా అన్నారని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తనకు రాజమౌళికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…