నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను 2022, జనవరి 7న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను డిసెంబర్ 3న విడుదల చేయాలనుకుని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం మేరకు జక్కన్న అండ్ టీమ్ మరో డేట్ను ఫిక్స్ చేశారట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను డిసెంబర్ 09న విడుదల చేయనున్నట్లు జక్కన్న టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ట్రైలర్ విడుదల కోసం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎందో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఆథ్యంతం ఎమోషనల్ తో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. బ్రిటీషర్ తో జరిగే పోరాట సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో అజయ్ దేవగణ్ భార్యగా శ్రీయ నటించారు. అయితే ఈ సినిమాలో జక్కన్న ఓ సన్నివేశంపై ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేశారట.
ఆ సన్నివేశం దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుందని.. ఈ సన్నివేశంలోనే అజయ్ దేవగణ్ భార్య శ్రీయ మరణిస్తారట. అంతే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సన్నివేశంలోనే తారసపడుతారనేది టాక్. ఎంతో ఎమోషనల్ టచ్ గా ఉండే దీనిపై జక్కన్న తన ప్రతిభను చూపించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో జరిగే ప్రతీ సీన్ ఎలాంటి కట్ లు లేకుండా.. అలానే సినిమాలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…