ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం అతడి వయస్సు 88 ఏళ్లు. తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. ఉదయం 8.20 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కాగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న ఈ కాంగ్రెస్ సీనియర్ నేత మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రోశయ్య గారు మరణించినందుకు బాధగా ఉంది. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు.. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనతో నేను జరిపిన సంప్రదింపులను తాను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నాను. . ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
అతడి మృతి పట్ల మెగస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ట్విట్టర్ ఇలా ట్వీట్ చేశారు..‘‘మాజీ గవర్నర్,మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడి వంటి వారు.ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నతనేత.
రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్యగారు . ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అంటూ నివాళి అర్పించారు. రోశయ్య కన్నుమూతతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు మెగస్టార్. ఆయన కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు చిరంజీవి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…