బద్రి సినిమాతో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసిన నటి రేణు దేశాయ్.. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు సినిమాతో వెండి తెరపై నటిగా అడుగు పెట్టింది. ఈ రోజు (04-12-2021) ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కర్లీ హెయిర్డ్ బ్యూటీ.. మోడల్గా కెరీర్ని ప్రారంభించి.. ఇండి పాప్ సాంగ్స్ లో కూడా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఆమె సినిమాలను నిర్మించడం, దర్శకత్వం వహించడం చేస్తున్నారు.
వీటి కంటే ముందే రెండు చిత్రాలలో పనిచేసింది. పవన్తో విడిపోయిన తర్వాత.. రేణు వారి పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణెకు వెళ్లారు. రేణు తన పిల్లలతోనే ఎక్కువగా సమయం కేటాయిస్తోంది. సోషల్ మీడియలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఆమె తమ అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది. హీరోయిన్ చేయడం మానేసిన తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను నిర్మాతగా, దర్శకురాలిగా మొదలు పెట్టారు.
ఈ రోజుకు ఆమెకు 40 ఏళ్లు నిండుతాయి. 41వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న రేణు దేశాయ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బుల్లి తెరమీద పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరో తాజా అప్ డేట్ ఏంటంటే.. త్వరలోనే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న టాక్ వినిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…