Categories: FeaturedMovie News

ఇప్పుడు కోట్లు గడిస్తున్న రాజేంద్ర ప్రసాద్ నాడు తనువు చాలించాలని ఎందుకు అనుకున్నారు ??

రాజేంద్ర ప్రసాద్… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పాత్రలు చేయలేదు అని అనకుండా అన్ని పాత్రలు చేసిన నటుడు ఆయన. హీరో, నిర్మాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటి చెప్పారు. అయితే ఈయన సినిమాలు ఎక్కువగా హాస్య సినిమాలు అని చెప్పవచ్చు. అయితే రాజేంద్రప్రసాద్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం….

రాజేంద్ర ప్రసాద్ గారు 1956 సంవత్సరం జూలై 19 న జన్మించారు. ఈయన స్వగ్రామం నిమ్మకూరు. ఈయన తన విద్యాభ్యాసం సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా వరకు పూర్తి చేశారు. ఆయన అప్పట్లోనే అంత చదివిన అతని మనసులో ఎప్పుడూ నటనపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని రాజేంద్ర ప్రసాద్ కూడా జన్మించడంతో చిన్నప్పుడు నుంచి ఎన్టీఆర్ ఇంటికి తరచుగా వెళ్ళి వస్తూండేవాడు రాజేంద్ర ప్రసాద్. ఇలా చిన్నప్పటి నుంచే అతనికి సీనియర్ ఎన్టీఆర్ ప్రభావం మనసులో బలంగా పడింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ కు ఉన్న ఆసక్తిని గమనించి ఆయన చెన్నైలోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రాజేంద్రప్రసాద్ వాళ్ళు రెండవ బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ లో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు.

ఇంత వరకు తల్లిదండ్రులు పంపించిన డబ్బులతోనే జీవితం కొనసాగించేవాడు. అయితే వారి తల్లిదండ్రులు తనని నువ్వు ఎంత చదువుకున్నావు మళ్లీ నటనలో ఇంత ప్రావీణ్యం చెందావు కానీ ఇంకా నువ్వు ఖాళీగానే ఉన్నావు అని అనడంతో వారి తల్లిదండ్రులతో మీరు నాకు డబ్బులు పంపించవద్దు నేను నా జీవితాన్నికి ఎలాగోలాగా సంపాదించుకుంటారు అని కోపంతో వారిని తిట్టి పంపించేసారట. అయితే రోజులన్నీ మనవి కాదు కదా… ఇక అప్పటి నుంచి రాజేంద్రప్రసాద్ కు తిప్పలు అంటే ఏంటో మొదలయ్యాయి. ఒకవైపు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా చెన్నైలో పాత్రల కోసం తిరిగాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనితో ఒకానొక దశలో ఆయన తనువు చాలించాలి అనుకునే స్టేజ్ కి చేరుకున్నారు అంటే నమ్మండి.

ఇక అలాంటి పరిస్థితుల్లో చివరగా గట్టి ప్రయత్నం చేద్దామని తనకి తెలిసిన వారిని కలవడానికి బయలుదేరారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండే పుండరీకాక్షయ్య దగ్గరికి పలకరించడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో తమిళంలో ఒక పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పుటకు మనిషిని వెతుకుతున్నారు. కానీ ఎంతమందిని ప్రయత్నించినా వారికి ఆర్టిస్ట్ దొరకలేదు. కానీ పుండరీకాక్షయ్య ఎందుకో రాజేంద్ర ప్రసాద్ ని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అతన్ని ఓకే చేశాడు. ఇక అంతే ఆ సన్నివేశంలో రాజేంద్ర ప్రదేశ్ బొల్లున ఏడవడం జరిగిందట. దీనితో ఏమైందని పుండరీకాక్షయ్య అడగా నేను మూడు రోజులు అయింది అన్నం తినలేదు. ముందు నాకు భోజనం పెట్టివ్వండి అని ప్రాధేయపడ్డాడు. దీనితో పుండరీకాక్షయ్య గారు రాజేంద్రప్రసాద్ కు భోజనం పెట్టించి ఆయన గురించి మొత్తం అడిగి తెలుసుకొని ఇక ముందు నీకు ఇలాంటి ఇబ్బందులు కలగవని ధైర్యం చెప్పాడు.

ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానాన్ని డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టాడు మొదట. ఇక ఆ తర్వాత నటుడిగా రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమాను 1977 సంవత్సరంలో నటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనకు పెద్ద పాత్రలు ఏమి రాలేదు కాకపోతే వివిధ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అదే సమయంలో తన డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ ను మాత్రం వదులుకోలేదు రాజేంద్రప్రసాద్. ఇక ఆ తర్వాత అప్పట్లో ప్రముఖ దర్శకుడు వంశీ ప్రేమించు పెళ్ళాడు చిత్రంతో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని పరిచయం చేశారు. అయితే ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. దానితో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి తన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా నవ్విస్తూనే తన సినిమా జీవితాన్ని గడిపారో అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతే కాకుండా 2015 సంవత్సరంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) కు అధ్యక్షుడిగా కూడా ఎన్నిక అయ్యి సినిమా రంగానికి తన సేవలందించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

21 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

21 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

22 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

22 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

22 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

22 hours ago