Categories: FeaturedMovie News

ఇప్పుడు కోట్లు గడిస్తున్న రాజేంద్ర ప్రసాద్ నాడు తనువు చాలించాలని ఎందుకు అనుకున్నారు ??

రాజేంద్ర ప్రసాద్… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పాత్రలు చేయలేదు అని అనకుండా అన్ని పాత్రలు చేసిన నటుడు ఆయన. హీరో, నిర్మాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటి చెప్పారు. అయితే ఈయన సినిమాలు ఎక్కువగా హాస్య సినిమాలు అని చెప్పవచ్చు. అయితే రాజేంద్రప్రసాద్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం….

రాజేంద్ర ప్రసాద్ గారు 1956 సంవత్సరం జూలై 19 న జన్మించారు. ఈయన స్వగ్రామం నిమ్మకూరు. ఈయన తన విద్యాభ్యాసం సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా వరకు పూర్తి చేశారు. ఆయన అప్పట్లోనే అంత చదివిన అతని మనసులో ఎప్పుడూ నటనపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని రాజేంద్ర ప్రసాద్ కూడా జన్మించడంతో చిన్నప్పుడు నుంచి ఎన్టీఆర్ ఇంటికి తరచుగా వెళ్ళి వస్తూండేవాడు రాజేంద్ర ప్రసాద్. ఇలా చిన్నప్పటి నుంచే అతనికి సీనియర్ ఎన్టీఆర్ ప్రభావం మనసులో బలంగా పడింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ కు ఉన్న ఆసక్తిని గమనించి ఆయన చెన్నైలోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రాజేంద్రప్రసాద్ వాళ్ళు రెండవ బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ లో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు.

ఇంత వరకు తల్లిదండ్రులు పంపించిన డబ్బులతోనే జీవితం కొనసాగించేవాడు. అయితే వారి తల్లిదండ్రులు తనని నువ్వు ఎంత చదువుకున్నావు మళ్లీ నటనలో ఇంత ప్రావీణ్యం చెందావు కానీ ఇంకా నువ్వు ఖాళీగానే ఉన్నావు అని అనడంతో వారి తల్లిదండ్రులతో మీరు నాకు డబ్బులు పంపించవద్దు నేను నా జీవితాన్నికి ఎలాగోలాగా సంపాదించుకుంటారు అని కోపంతో వారిని తిట్టి పంపించేసారట. అయితే రోజులన్నీ మనవి కాదు కదా… ఇక అప్పటి నుంచి రాజేంద్రప్రసాద్ కు తిప్పలు అంటే ఏంటో మొదలయ్యాయి. ఒకవైపు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా చెన్నైలో పాత్రల కోసం తిరిగాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనితో ఒకానొక దశలో ఆయన తనువు చాలించాలి అనుకునే స్టేజ్ కి చేరుకున్నారు అంటే నమ్మండి.

ఇక అలాంటి పరిస్థితుల్లో చివరగా గట్టి ప్రయత్నం చేద్దామని తనకి తెలిసిన వారిని కలవడానికి బయలుదేరారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండే పుండరీకాక్షయ్య దగ్గరికి పలకరించడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో తమిళంలో ఒక పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పుటకు మనిషిని వెతుకుతున్నారు. కానీ ఎంతమందిని ప్రయత్నించినా వారికి ఆర్టిస్ట్ దొరకలేదు. కానీ పుండరీకాక్షయ్య ఎందుకో రాజేంద్ర ప్రసాద్ ని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అతన్ని ఓకే చేశాడు. ఇక అంతే ఆ సన్నివేశంలో రాజేంద్ర ప్రదేశ్ బొల్లున ఏడవడం జరిగిందట. దీనితో ఏమైందని పుండరీకాక్షయ్య అడగా నేను మూడు రోజులు అయింది అన్నం తినలేదు. ముందు నాకు భోజనం పెట్టివ్వండి అని ప్రాధేయపడ్డాడు. దీనితో పుండరీకాక్షయ్య గారు రాజేంద్రప్రసాద్ కు భోజనం పెట్టించి ఆయన గురించి మొత్తం అడిగి తెలుసుకొని ఇక ముందు నీకు ఇలాంటి ఇబ్బందులు కలగవని ధైర్యం చెప్పాడు.

ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానాన్ని డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టాడు మొదట. ఇక ఆ తర్వాత నటుడిగా రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమాను 1977 సంవత్సరంలో నటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనకు పెద్ద పాత్రలు ఏమి రాలేదు కాకపోతే వివిధ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అదే సమయంలో తన డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ ను మాత్రం వదులుకోలేదు రాజేంద్రప్రసాద్. ఇక ఆ తర్వాత అప్పట్లో ప్రముఖ దర్శకుడు వంశీ ప్రేమించు పెళ్ళాడు చిత్రంతో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని పరిచయం చేశారు. అయితే ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. దానితో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి తన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా నవ్విస్తూనే తన సినిమా జీవితాన్ని గడిపారో అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతే కాకుండా 2015 సంవత్సరంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) కు అధ్యక్షుడిగా కూడా ఎన్నిక అయ్యి సినిమా రంగానికి తన సేవలందించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago