General News

నేడు రాఖీ పండుగ.. ఈ రోజు సోదరులు ఏం చేయాలి.. వాటి విశిష్టత ఏమిటి!

ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. ప్రస్తుతం ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు. నేడు (ఆగస్టు 22)న దేశ వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు ఎంతో కనుల పండుగగా జరుపుకోనున్నారు. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర.. సోదరీమణులకు మధ్య ఉండే బంధం చాలా స్పెషల్. ఎన్ని గొడవలు, వాగ్వాదాలు పెట్టుకున్నప్పటికీ చివరికీ ఇద్దరూ ఒక్కటై పోతారు. చెల్లి ఆపదలో ఉందంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది అన్న మాత్రమే. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. అలాంటి ప్రత్యేక బంధం ఇది. వీరు ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుకోవడానికి వీలైన పండగ వేదిక రక్షాబంధన్. ఈ రాఖీ పౌర్ణమి ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.

తన సోదరుడు ఎన్నో శిఖరాలను అధిరోహించాలని.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతీ సోదరి కోరుకుంటుంది. అయితే ఇంతటి విశిష్టత ఉన్న రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే.. ఈ పండగ మొత్తం రెండు పదాలతో కూడుకున్నది. ఒకటి రక్షణ.. మరొకటి బంధనం. సంస్కృతం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పండుగని ముడితో రక్షణ ఇవ్వమని అర్థం. రక్షణ అంటే రక్షణ కలిగించడం బంధం అంటే కట్టుకోవడం. అలానే ఇది కేవలం సోదరి సోదరుడు మాత్రమే జరుపుకొనే పండుగ కాదు. మరదలు, చెల్లెలు, కజిన్స్ ఇలా ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీటికి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. సమాజంలో మానవతా విలువలు మంటకలిసిపోతున్న నేపథ్యంలో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

రాఖీ పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని.. రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు.. సోదరీమణులు. అన్న లేదా తమ్ముడు కూడా సోదరీమణులు కట్టిన రాఖీలను స్వీకరించి తమకు తోచిన సహాయాన్ని ఇస్తుంటారు. “యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు సోదరీమణులు. తరువాత స్వీట్స్ తినిపిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. ఈ సంవత్సరం రాఖీలకు గిరాఖీ బాగా పెరిగింది. బంగారం, వెండి రాఖీలు కూడా మార్కెట్లో సరికొత్త డిజైన్లతో సందడి చేస్తున్నాయి.

రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే మంచి జురుగుతుందని నమ్మకం. ఇలా చేసేవారికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావని చెబుతుంటారు. ఈ రోజు చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే దోషాలు పోతాయని కూడా చెబుతుంటారు. రక్షా బంధన్ నాడు సోదరీ సోదరులకు రాఖీ కట్టడం సోదరుడు తిరిగి ఏదైనా బహుమతి ఇవ్వడం తరతరాలుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆచారం ప్రకారం రక్షా బంధన్ జరుపుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడూ అక్కా తమ్ముడు, అన్నాచెల్లెళ్లు చక్కగా ఒకరికొకరు తోడుగా.. నీడగా.. నిలవాలని ‘తెలుగు డెస్క్’ కోరుకుంటోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

23 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago