Movie News

సమంత, కాజల్ బాటలోనే రకుల్… త్వరలోనే అధికారిక ప్రకటన!

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పలువురు నటీమణులు వెబ్ సిరీస్ లో అడుగు పెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని కోడలు సమంత, వెండితెర చందమామ కాజల్ అగర్వాల్, మిల్క్ బ్యూటీ తమన్నా లాంటివారు పలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరి స్టార్ సెలబ్రిటీల చూపుకూడా వెబ్ సిరీస్ ల పై పడింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకుల్లో బాగా డిమాండ్ పెరిగినా ఓటీటీ కంటెంట్‌తో త్వరలోనే ఆకట్టుకోవాలని రకుల్ ప్రీత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే సరికొత్త కథలను వినే పనిలో పడ్డారు. దర్శకులు కొత్త వారైనా కథలో నైపుణ్యం ఉంటే చేయడానికి ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఓటీటీ అనేది బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ వేదికపై విడుదల కావడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరైన కథ నచ్చితే ఓటీటీ లో ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమైనట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

2 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

4 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

4 hours ago