టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి కాగానే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పటికే శంకర్ ఈ సినిమాను ఎక్కడ చిత్రీకరించాలనే విషయాల గురించి ఆలోచించాడని అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల నుంచి వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం వినబడుతుంది. ఎక్కువభాగం ఈ చిత్రాన్ని శంకర్ ఇండియాలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని..ఇండియాలో కూడా ఎక్కువ భాగం తెలంగాణలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 8న సినిమా షూటింగ్ ప్రారంభం కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జూలై నాటికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబోలో తెలుగులో “వినయ విధేయ రామ” తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే చెర్రీ సరసన నటించారు. ఇక ఆచార్య సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…