Ram Gopal Varma : ఎపుడూ వివాదాలతో జీవించే ఆర్జీవి ప్రస్తుతం రాజకీయాల మీద పడ్డారు. అందునా ఏపీ రాజకీయాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ టీడీపీ జనసేన పార్టీల మీద విమర్శలను గుప్పిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తే ఆ ఇష్యూ మీద అర్జీవి తన గళం వినిపించారు. హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ళ చిన్నారి చనిపోతే ఆ సంఘటన ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆర్జీవి మాత్రం ఆ ఇష్యూ మీద తన స్టైల్ లో ట్వీట్ చేసి దట్ ఈజ్ ఆర్జీవి అనిపించుకున్నాడు.
నాలుగేళ్ళ కుర్రాడిని కుక్కలు చంపితే ఒక్క స్టార్ కూడా స్పందించలేదు…
ఆర్జీవి కుక్కల దాడి లో చిన్నారి మరణం గురించి మాట్లాడుతూ నేను చూసిన అత్యంత క్రూరమైన వీడియోల్లో ఇదే మొదటిది. ఒక చిన్నారిని కుక్కలు లాక్కెళ్లడం అది కూడా నగరం మధ్యలో సంఘటన జరిగింది. కానీ ఏ ఒక్క సినిమా సెలబ్రిటీ కానీ ప్రముఖులు కానీ స్పందించలేదు. స్పందిస్తే ఏమవుతుందో అన్నట్లుగా చూసి చూడనట్లు ప్రవర్తించారు.
నగరంలో కుక్కలు ఎన్ని ఉన్నాయని అడిగితే దాదాపు 6 లక్షలు అని జహెచ్ఏంసి కమిషన్ చెబుతోంది. అందులో వాస్తవం ఎంత.. అదీ కాక వాళ్ళు చెప్పినట్లే ఆరు లక్షల కుక్కలు ఉంటే వాటిలో ఎన్నింటికి ఆపరేషన్ చేసారు లెక్క వారికి ఎలా తెలుసుస్తుంది. అంత సిబ్బంది వారి దగ్గర ఉన్నారా అంటూ వర్మ ప్రశ్నించారు. అందుకే నగర మేయర్ ఇంట్లోకి ఒక ఐదు లక్షల కుక్కల్ని వదిలితే ఎలా ఉంటుందో ట్వీట్ చేశాను అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…