తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడినా అది తీవ్ర వివాదాలకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే గోపాల్ వర్మ నేడు కొండ సురేఖ బయోపిక్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.
ఇలా అక్కడికి వెళ్ళిన రామ్ గోపాల్ వర్మను మీడియా చుట్టుముట్టి పలు ప్రశ్నలను వేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రశ్నించారు. టిడిపి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి బోస్ డీకే అనే పదం అర్థం గురించి ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఆ పదంపై స్పందించడానికి నిరాకరించారు. ఈ మేరకు అతనికి ఈ పదానికి అర్థం తెలియదని డిక్షనరీలు వెతికే అంత టైం కూడా తనకు లేదని.. ఇప్పటికే ఈ పదం గురించి చాలామంది మాట్లాడారు. మరి నాతో కూడా మాట్లాడించకండి అంటూ ఈ ప్రశ్నలను దాటవేశారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలకు స్పందించిన రాంగోపాల్ వర్మ గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర సాము వంటి వాటిని నేర్చుకోవడం ఎంతో అవసరమని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…