Movie News

RGV: శ్రీదేవి ఫోటోను చూసి ఏడ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ ట్వీట్ వైరల్?

RGV: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.

ఒకరకంగా చెప్పాలి అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడుగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇదంతా మొన్నటి వరకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. అసలేం జరిగింది రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో ఏం రాసుకోవచ్చారు అన్న విషయానికి వస్తే… దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే.

శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది..

ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని కూడా తెలిపారు ఆర్జీవి. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఒక శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నీకు కూడా ఏడుపు వస్తుందా!ఏం తాగి పోస్ట్ చేశావా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2cmRZ_pDqb/?utm_source=ig_embed&ig_rid=51e4d1ee-b28d-4e64-9ea0-04154e2752f2

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

8 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

8 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

8 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

9 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

9 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

9 hours ago