Saindhav: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కాగా ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ మూవీ జనవరి 13న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఓపెనింగ్స్ లేకపోయినా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ యాక్షన్ , ఫ్యామిలీ డ్రామా మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ జనవరి 13న రిలీజైంది. వసూళ్ల పరంగా భారీగా కాసులు కురిపించకపోయినప్పటికి వెంకీ మార్క్ సక్సెస్ ని మాత్రం సొంతం చేసుకుంది. కూతురు సెంటిమెంట్ తో సాగిన ఈ సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉందని ఆడియన్స్ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
సుమారు 15కోట్లతో రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం నెల రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ విడుదల కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయిందట. వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు, హీరో ఊహించిన స్థాయిలో ఈసినిమాపై థియేటర్ లో రెస్పాన్స్ రాలేదు. మరి ఓటీటీలో అయినా వస్తుందో లేదో చూడాలి మరి.
స్ట్రీమింగ్ అప్పటినుంచే..
వెంకటేష్ ఫ్యామిలీ మెన్, యాక్షన్ హీరోగా రెండు యాంగిల్స్ ను ఈసినిమాలో చూపించినప్పటికి ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. సైంధవ్ సినిమా ఫిబ్రవరి 2వ తేది లేదా 9న కాని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తుందని తెలుస్తోంది. అయితే స్టార్ హీరో వెంకటేష్ సినిమా విడుదల అయి నెలరోజులు కూడా కాకుండా ఓటిటిలోకి వస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…