రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్జీవీ. ఎప్పుడు ఎవరి మీద కామెంట్ చేస్తారో.. ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ఎక్కువగా ఆయన చెప్పే మాటలకే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటారు.
సినిమాలను చాలా మంది థియేటర్లు లేక ఓటీటీలకు ఇస్తుంటే.. అతడు మాత్రం ఆర్టీవీ థియేటర్ అంటూ చిన్నపాటి ఓటీటీ లాంటిది ఏర్పాటు చేసుకొని తన సినిమాలను అందులోనే విడుదల చేస్తుంటారు. అలా అందరు ఒక వైపు ఉంటే.. అతడు మాత్రం నాదారే రాహదాని అన్నట్లు ఓ వైపు ఉంటాడు. అయితే ఇటీవల సునీల్ నటించిన ‘కనబడుట లేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ ఈవెంట్లో వర్మ స్పీచ్ అందరికంటే హైలెట్ అయింది.
రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిలో రాజమౌళి పేరు ప్రస్తావించారు. విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి వర్మ అడిగి నవ్వులు పూయించారు.
నా పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? లేదా నా బోడి కొడుక్కే అంత ఉంటే.. నాకు ఎంత ఉండాలని రాజమౌళి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుతున్నారా? అని విజయేంద్ర ప్రసాద్ను ఆట పట్టించారు వర్మ. ఇక ఆ మాటలకు విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. దీంతో అక్కడ జనాలు విజల్స్ తో క్లాప్స్ కొట్టారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…