కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా నగర పరిధిలోని బాగుయాటీ ప్రాంతంలో కాళికామాత దేవి ఆలయంలో దుర్గామాత ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.
ఈ ప్రస్తుత తరుణంలో అమ్మవారికి బంగారంతో మాస్క్ తయారు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలనే సందేశాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ సారి దుర్గామాతకు 20 గ్రాముల బంగారంతో తయారు చేసిన మాస్క్ తయారు చేయించారు. అంతేకాకుండా ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేస్తూ చేతిలో సిరంజి,ఆక్సీమీటర్, ఇతర వైద్య సామాగ్రి, శానిటైజర్ లు పెట్టారు.
ఇలా భక్తులకు కరోనా నిబంధనల గురించి తెలియజేస్తూ.. వాటిని పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. బంగారం మాస్కుతో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని బంధుమహల్ క్లబ్ లో టీఎంసీ ఎమ్మెల్యే, బెంగాల్ గాయని అదితి మున్షీ ఆవిష్కరించారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో డాక్టర్లు చెప్పే నియమాలు పాటించాలనే సంకేతంగా మాస్క్ను ఉంచామని మున్షీ చెప్పారు.
గత సంవత్సరంలో కరోనా కారణంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సారి అలా కాకుండా పూజా మండళ్లకు వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు తెలియజెప్పేందుకే అమ్మవారికి కూడా బంగారంతో చేసిన మాస్కు పెట్టామని నిర్వాహకులు వివరించారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…