కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా నగర పరిధిలోని బాగుయాటీ ప్రాంతంలో కాళికామాత దేవి ఆలయంలో దుర్గామాత ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.
ఈ ప్రస్తుత తరుణంలో అమ్మవారికి బంగారంతో మాస్క్ తయారు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలనే సందేశాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ సారి దుర్గామాతకు 20 గ్రాముల బంగారంతో తయారు చేసిన మాస్క్ తయారు చేయించారు. అంతేకాకుండా ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేస్తూ చేతిలో సిరంజి,ఆక్సీమీటర్, ఇతర వైద్య సామాగ్రి, శానిటైజర్ లు పెట్టారు.
ఇలా భక్తులకు కరోనా నిబంధనల గురించి తెలియజేస్తూ.. వాటిని పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. బంగారం మాస్కుతో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని బంధుమహల్ క్లబ్ లో టీఎంసీ ఎమ్మెల్యే, బెంగాల్ గాయని అదితి మున్షీ ఆవిష్కరించారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో డాక్టర్లు చెప్పే నియమాలు పాటించాలనే సంకేతంగా మాస్క్ను ఉంచామని మున్షీ చెప్పారు.
గత సంవత్సరంలో కరోనా కారణంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సారి అలా కాకుండా పూజా మండళ్లకు వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు తెలియజెప్పేందుకే అమ్మవారికి కూడా బంగారంతో చేసిన మాస్కు పెట్టామని నిర్వాహకులు వివరించారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…